amp pages | Sakshi

విద్యార్థులను గెంటేసి.. స్కూల్‌ ను గోశాలగా మార్చారు

Published on Sat, 04/14/2018 - 20:06

సాక్షి, హైదరాబాద్‌ : బడిలో చదువుకుంటున్న పేద పిల్లలను ఖాళీ చేయించి దాన్ని గోశాలగా మార్చేశారు నగరానికి చెందిన వీరాంజనేయ స్వామీ మందిర్‌ కమిటీ సభ్యులు. నివ్వెర పోయే ఈ సంఘటన ఉప్పుగూడలోని అరుంధతి కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. జనవరిలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలతను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు, కొన్ని రోజుల కోసం పాఠశాలను గుడి అవసరాలకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.

దాని కోసం కొన్ని రోజులు బడిని వేరే చోటికి బదిలీ చేయాల్సిందిగా సూచించారు. ఆలయ పనుల కోసం అడుగుతున్నారు కదా అని ప్రధానోపాధ్యాయురాలు పద్మ వారి వినతిని అంగీకరించారు. జనవరి 21న పాఠశాలను అరుంధతి కాలనీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేషా నగర్‌కు మార్చారు. పద్మలత వారికి నాలుగు నెలల గడువు ఇచ్చారు. ఆలోపు అన్ని పనులు పూర్తి చేసుకుని పాఠశాలను తిరిగి అప్పగించాల్సిందిగా ఆలయ కమిటీకి తెలిపారు.

నాలుగు నెలల తర్వాత పాఠశాల గోశాలగా మారడాన్ని చూసి ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆశ్చర‍్యపోయారు. ఇదేంటని ఆలయ కమిటీని ప్రశ్నించగా ఈ స్థలం తమదేనంటూ ఆమెపై దూషణకు దిగారు కమిటీ సభ్యులు. ఏప్రిల్‌ 11న పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి ఆమె నిరసన తెలిపిన ఫలితం లేకుండా పోయింది. ఆలయ కమిటీకి చెందిన ఒక సభ్యుడు దీనిపై స్పందిస్తూ.. ఈ స్థలం ఆలయానికి సంబంధించిందని, ప్రభుత్వ అధికారులు పాఠశాల కోసం మమ్మల్ని సం‍ప్రదించినప్పుడు కమిటీ హాలును వారికి ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఇదే విషయమై స్పందించిన ఎంఈఓ, ప్రస్తుత గోశాల ఉన్న స్థలం ప్రభుత్వానిదేనని, దానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. 1999 నుంచి ఇక్కడ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆలయ సమీపంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అనే బోర్డును కూడా పెట్టించారు.

Videos

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)