రూ.8.1 లక్షలు పలికిన బంగారు లడ్డూ

Published on Sun, 09/23/2018 - 08:43

కవాడిగూడ: ముషీరాబాద్‌ నియోజకవర్గం భోలక్‌పూర్‌ హౌస్‌ శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 తులాల బంగారంతో తయారైన గణపతి లడ్డూ వేలంలో రూ.8.1 లక్షలు పలికింది. భోలక్‌పూర్‌కు చెందిన చేపల వ్యాపారి కాడబోయిన భాస్కర్‌ 11 కేజీల సాధారణ లడ్డూతో పాటు బంగారు లడ్డూను దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా గణపతి వద్ద బంగారు లడ్డూను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు జి.అనిల్‌ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ గ్రేటర్‌ అధ్యక్షుడు ఎం.ఎన్‌.శ్రీనివాస్‌రావు, భోలక్‌పూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు నవీన్‌కుమార్, బీజేపీ ముషీరాబాద్‌ నియోజకవర్గ కో–కన్వీనర్‌ ఎం.నవీన్‌గౌడ్, నాయకులు శ్రీధర్‌చారి, రవిచారి, ముప్పిడి నర్సింగ్‌రావు, బబ్లూ, భాను, కిశోర్‌యాదవ్, పరమేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ