amp pages | Sakshi

ఉచిత బియ్యం హుళక్కి!

Published on Wed, 04/29/2020 - 09:40

ఉచిత బియ్యం కోసం ఎదురుచూసిన నిరుపేదలకు అధికారులు రిక్తహస్తం చూపించారు. సుమారుమూడు లక్షల కుటుంబాలు అర్ధాకలితో అలమటించే పరిస్థితిలోకి నెట్టివేశారు.  లాక్‌డౌన్‌ కష్టకాలంలో కొంతమంది పేదలకు ‘ఉచిత బియ్యం’ అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారాఈ నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు.. తొమ్మిది రోజుల ముందే
రేషన్‌ షాపులు మూసివేయడంతో ఆహార భద్రతకార్డు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

సాక్షి,సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ కష్టకాలంలో సుమారు మూడు లక్షలకు పైగా నిరుపేద కుటుంబాలకు ‘ఉచిత బియ్యం’ అందని దాక్షగా మారింది. పౌరసరఫరాల శాఖ అధికారుల తీరుతో ఉచిత బియ్యం అందుకోలేక పోయామన్న ఆవేదన పేద వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఈ నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు.. తొమ్మిది రోజుల ముందే రేషన్‌ షాపులు మూయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆహార భద్రతకార్డు కలిగిన నిరుపేద కుంటుంబాలకు ఉచిత బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం రూ.1,500 ఆర్థిక సాయం ప్రకటించింది. రేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యుడు (యూనిట్‌)కు 12 కిలోల ఉచిత బియ్యం ప్రకటించడంతో నిరుపేదలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

దీంతో ఉచిత బియ్యం పంపిణీ పాయింట్ల ముందు నిరుపేదలు పెద్ద ఎత్తున బారులు తీరారు. నిబంధనల ప్రకారం ప్రతి నెల 15 తారీఖున రేషన్‌ సరుకుల పంపిణీ గడువు ముగుస్తుంది. దీంతో తమకు ఎక్కడ బియ్యం దక్కవోనని కనీసం పేదలు పెద్ద ఎత్తున షాపుల ముందు బారులు తీరారు. బియ్యం పంపిణీ ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగుతుందని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. మరోవైపు పౌరసరఫరాలు శాఖ వెబ్‌సైట్‌లో అధికారికంగా ఈనెల 28న క్లోజింగ్‌ డేట్‌గా వెల్లడించింది. దీంతో పేదలు కొంత ఊపిరి పీల్చుకొని రద్దీ తగ్గిన తర్వాత ఉచిత బియ్యం అందుకుందామని భావించారు. కానీ ఈ నెల 21 గడువు ముగిసినట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించడంతో గడువు నెలాఖరు వరకు ఉందన్న ఆశతో ఇప్పటి వరకు బియ్యం అందుకోని నిరుపేదలకు నిరాశే మిగిలినట్లయింది. 

ఇదీ లేక్క..
గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి మొత్తం 16,00,930 ఆహార భద్రతకార్డులున్నాయి. ఇందులో 15,13,317 కార్డుదారులు మాత్రమే ఉచిత బియ్యం అందుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సైతం స్థానికేతరులైన 2,18,747 కార్డుదారులకు స్టేట్‌ రేషన్‌ పోర్టబిలిటీ ద్వారా ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. మొత్తం మీద గ్రేటర్‌ పరిధిలోని 12,94,570 కుటుంబాలు మాత్రమే ఉచిత బియ్యం అందుకున్నట్లు  గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో సుమారు 3,06,360 కుటుంబాలకు ఉచిత బియ్యం అందని ద్రాక్షగా మారినట్టు కనిపిస్తోంది. దీంతో పౌరసరఫరాల అధికారుల తీరుపై పేదలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)