మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం

Published on Mon, 01/14/2019 - 04:51

కేసముద్రం: టీఆర్‌ఎస్‌ నుంచి తనను ఏకగ్రీవం చేయకుండా మరో వ్యక్తిని చేయడం పట్ల మనస్తాపం చెంది ఓ మాజీ సర్పంచ్‌ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పార్వతి కుటుంబం అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వచ్చింది.

ఈ సారి జరిగే సర్పంచ్‌ ఎన్నికల బరిలో నిలబడేందుకు సన్నద్ధమయ్యారు. ఇదే తరుణంలో సర్పంచ్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక ఇతర పార్టీ నాయకులతో పార్వతి భర్తను చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో మరో అభ్యర్థిని ఎంపిక చేశారు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురైన పార్వతి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ