amp pages | Sakshi

ఆధునీకరిస్తేనే వెలుగు

Published on Tue, 10/03/2017 - 13:23

కామారెడ్డి నుంచి సేపూరి వేణుగోపాలచారి : రాష్ట్రంలోనే తొలి జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఆధునీకరిస్తే మరిన్ని వెలుగులు వెదజల్లుతుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద  మొదటి జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. 1954లో ప్రాజెక్టు హెడ్‌స్లూయిస్‌ వద్ద జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. 1954 ఫిబ్రవరి 23న తొలి యూనిట్‌ను, 1955 నవంబర్‌ 28న రెండో యూనిట్‌ను, తర్వాత కొంతకాలానికే మూడో యూనిట్‌ను ప్రారంభించారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో రూ.2.27 కోట్లు ఖర్చు చేశారు.

ఇంగ్లండ్‌లో తయారైన మూడు టర్బయిన్లు తీసుకొచ్చి 15 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నెలకొల్పారు. ఒక్కో టర్బయిన్‌ ద్వారా ఐదు మెగావాట్ల లెక్కన రోజుకు 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా నిర్మించారు. మూడో టర్బయిన్‌లో సాంకేతిక సమస్య  తలెత్తి 1968 నుంచి పది మెగావాట్ల కరెంటు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పంటలకు విడుదల చేసే నీటి ఆధారంగా ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

కొద్దిపాటి మరమ్మతులు చేస్తే..
నిజాంసాగర్‌ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి కొద్దిపాటి నిధులు సమకూర్చి ఆధునీకరించాల్సి ఉంది. మూలన పడిన మూడో టర్బయిన్‌ను వినియోగంలోకి తీసుకొస్తే మరో ఐదు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. పూర్తిస్థాయి నీటి వనరులు అందుబాటులో ఉండడం, విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ నిర్మితమై ఉండడంతో ఇక్కడ అదనపు విద్యుత్‌ ఉత్పత్తి సులభం.

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)