నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈతకు వెళ్లి.. తండ్రి, కొడుకుల మృతి
Published on Fri, 05/15/2020 - 08:26
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాజిపేటకు చెందిన బోయ గురువయ్య(40)కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు శివ(9)కు ఈత నేర్పేందుకు తండ్రి రోజూ గ్రామ శివారులోగల అమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వెళ్లిన వారు రాత్రి వరకు తిరిగి రాలేదు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సర్పంచ్ వేణుగోపాల్గౌడ్ను ఆశ్రయించారు. ఆయనతోపాటు గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా కొత్తబావి గట్టుపై దుస్తులు కనిపించాయి. బావిలో వెతుకగా శివ, గురువయ్యల మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
#
Tags