amp pages | Sakshi

కన్నీళ్లే మిగిలాయి..

Published on Thu, 04/12/2018 - 11:22

కందుకూరు(మహేశ్వరం): భూగర్భ జలాలు అడుగంటి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. దీంతో పశువులకు మేతగా వేయడం లేదా దున్నేయడమో చేస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈఏడాది వరి సాగు చేసిన రైతన్నలు ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్య. ప్రస్తుతం 24 గంటల విద్యుత్‌తోనే భూగర్భ జలాలు అడుగంటాయని, 12 గంటలు పగటి పూట సరఫరా చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని కొంతమంది రైతులు పేర్కొంటున్నారు.

నేదునూరుకు చెందిన రైతు సాటు మల్లయ్య తనకున్న రెండు ఎకరాల భూమి అందులో ఒక బోరు ఉంది. కాగా రబీలో అర ఎకరంలో వరి సాగు చేశాడు. తీరా పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి బోరు ఎండిపోయింది.  
కొత్తగూడకు చెందిన అన్నదమ్ములు బాల్‌రాజ్, శంకర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఎకరన్నర భూమిలో రబీ సీజన్‌లో వరి సాగు చేపట్టారు. వారికున్న మూడు బోర్లలో ప్రస్తుతం ఒకే బోరు నడుస్తుంది. అందులో సైతం భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో తొలుత అర ఎకరంలో వరి ఎండిపోగా పశువుల మేతకు వదిలేశారు. దీంతో ఏం చేయాలో తెలియక  రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పశుపోషణపై ఆధారపడి నెట్టుకొస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సౌడపు శంకర్‌ సాగు చేసిన వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో నష్టపోయాడు. ఇలా మండల వ్యాప్తంగా పలువురు రైతులు రబీలో వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు.  

24 గంటల కరెంట్‌తోనే...
24 గంటల విద్యుత్‌తో నిరంతరాయంగా బోర్లు నడవడంతో నీటి మట్టాలు పడిపోయాయి. దీంతో పంటలకు నీరు అందించలేకపోతున్నాం. పగటిపూట విద్యుత్‌ ఇస్తే ఇంత నష్టం ఉండేది కాదు. ఎకరన్నరలో సాగు చేసిన వరి పంటను ఇప్పటికే సగం పశువులకు మేపాం. ఇప్పుడు మిగతా పంట ఎండిపోతుంది. చాలా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి.    – బాల్‌రాజ్, రైతు, కొత్తగూడ  

తొమ్మిది గంటలు సరిపోతుంది
పగటి పూట 9 గంటలు విద్యుత్‌ ఇస్తే సరిపోతుంది. 24 గంటలు ఇవ్వడంతో నిరంతరాయంగా బోర్లను ఆన్‌ చేసి ఉంచడంతో భూగర్భ జలాల మట్టం వేగంగా పడిపోయి పంటలకు నీరు అందడంలేదు. దీంతో కొద్ది విస్తీర్ణంలో సాగు చేసిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి. – సురేందర్‌రెడ్డి, రైతు, నేదునూరు

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)