మంత్రి ఈటల సమక్షంలో...

Published on Sun, 04/02/2017 - 13:23

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి ఈటల రాజేందర్‌ ఎదుట ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మండలంలోని పొత్తూరు గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు మంత్రి రాజేందర్‌ ఆదివారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని పోలీసులు అడ్డుకుని నచ‍్చజెప్పారు.

సాగునీరు అందక వరిపంట ఎండిపోయిందంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. ఎండిన పంటలను సర్వే చేయించి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ