amp pages | Sakshi

787 కాలేజీలు మూత

Published on Wed, 01/09/2019 - 01:19

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు తగ్గుతున్నాయి. నాణ్యత ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతుండటంతో కాలేజీలు మూత పడుతున్నాయి. కొన్ని కాలేజీలు విద్యార్థుల్లేక యాజమాన్యాలే రద్దు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తేల్చిన లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నత విద్య అందించే కాలేజీలు 3,688 ఉంటే అవి 2018–19 విద్యా సంవత్సరం నాటికి 2,901కి తగ్గాయి. ఈ ఐదేళ్లలో 787 కాలేజీలు మూతపడ్డాయి. వచ్చే ఏడాది మరో 200 వరకు డిగ్రీ, ఇతర కాలేజీలు మూత పడే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఫార్మ్‌–డి, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీపీఈడీ తదితర కోర్సులు నిర్వహించే కాలేజీలు వందల సంఖ్యలో తగ్గినా ఆయా కోర్సుల్లో సీట్లు మాత్రం భారీగా పెరి గాయి. అయినా పెరిగిన సీట్లకు అనుగుణంగా విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడం గమనార్హం.

అత్యధికంగా డిగ్రీ కాలేజీలే మూత
రాష్ట్రంలో అత్యధికంగా డిగ్రీ కాలేజీలు మూత పడుతున్నాయి. 2018–19 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో 1,151 డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు చేపడితే అందులో 25 శాతంలోపే ప్రవేశాలు జరిగిన కాలేజీలు 786 ఉండటం గమనార్హం. 280 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అందులో అన్ని కాలేజీలు మూతపడకపోవచ్చు. ఇప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉంటారు. మరోవైపు ప్రమాణాలు పెంచుకుంటే వచ్చే విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. అయినా ఒక్క డిగ్రీలోనే 150 కాలేజీలకు మూసివేత ముప్పు పొంచి ఉంది. ఇతర కోర్సుల్లోనూ జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 200 కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గనుక వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపే ప్రవేశాలు జరిగిన కోర్సులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తే వందల సంఖ్యలో కాలేజీలు మూతపడే అవకాశం ఉంది.

ఆశించిన మేర లేని ప్రవేశాలు
ఐదేళ్లలో ప్రవేశాలు అంత ఆశాజనకంగా లేవు. సీట్లు పెరిగిన స్థాయిలో ప్రవేశాలు పెరగలేదు. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో 3,77,344 మంది విద్యార్థులు చేరితే 2018–19 విద్యా సంవత్సరంలో 3,97,225 మంది విద్యార్థులు చేరారు. అన్ని కాలేజీల్లో 1,28,887 సీట్లు పెరిగినా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఐదేళ్ల కిందటితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య 19,881 మాత్రమే పెరిగింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌