సుష్మను చేరుకో‘లేఖ’..!

Published on Wed, 10/01/2014 - 18:56

హైదరాబాద్: ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది’ దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఐదుగురు ఖైదీల పరిస్థితి. ఖైదీల విడుదలకు సహకరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సెప్టెంబర్2న రాసిన లేఖ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు అందకపోవడంతో వారి విడుదల ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్ రాయ్ 2005లో దుబాయిలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకటి, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, సయ్యద్‌లకు శిక్షపడింది. అప్పటి నుంచి వారు దుబాయ్ జైలులో ఉన్నారు. దుబాయ్‌లో అమలులో ఉన్న షరియా చట్టం ప్రకారం రూ.15లక్షల బ్లడ్ మనీ చెల్లిస్తే నిందితులను క్షమించి విడుదల చేయడానికి హతుడి కుటుంబసభ్యులు అంగీకరించారు.

గతేడాది మేలో కేటీఆర్ నేతృత్వంలో ‘మై గ్రాంట్స్ రైట్స్ కౌన్సిల్’ సభ్యులు నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లి దిల్‌ప్రసాద్ రాయ్ భార్యకు ఆ మొత్తాన్ని చెల్లించారు. దీంతో ఖైదీల విడుదలకు అంగీకరిస్తూ ఆమె గతేడాది జూన్ 5న సంబంధిత పత్రాలను నేపాల్ విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖకు సమర్పించింది. అయితే, ఆ పత్రాలు దుబాయ్ ప్రభుత్వానికి చేరకపోవడంతో ఖైదీలను విడుదల చేయలేదు. మరోసారి స్పందించిన కేటీఆర్ గతనెల 2న సుష్మాకు లేఖరాశారు.

ఖైదీల విడుదలకు సంబంధించిన పత్రాలను దుబాయ్ ప్రభుత్వానికి పం పించేలా నేపాల్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ లేఖలో కోరారు. అయితే, ఖైదీల విడుదల కోసం ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తామే కేంద్రమంత్రిని కలసి ఈ లేఖను అందిస్తామని తీసుకెళ్లినట్లు సమాచారం. విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్న సుష్మాస్వరాజ్‌ను ఈ స్వచ్ఛంద ప్రతినిధులు కలవలేకపోవడంతో ఇంకా ఆ లేఖ విదేశాంగ శాఖకు చేరలేదని తెలిసింది.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)