amp pages | Sakshi

డ్రైవింగ్ & పరిశోధన

Published on Fri, 10/20/2017 - 07:42

సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్‌ : డ్రైవింగ్‌లో శిక్షణ, పరిశోధన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటవుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు కేంద్ర ప్రభుత్వం జారీ చేయడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. శిక్షణ కేంద్రం కోసం 20 ఎకరాలను జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద కేటాయించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంకాగా, దక్షిణ భారత దేశంలో రెండో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం అవుతుంది. తొలి శిక్షణ కేంద్రం తమిళనాడులో ఉండగా.. రెండోది సిరిసిల్లలోనే ఏర్పాటవుతోంది.

ఇక్కడ డ్రైవింగ్‌లో మెరుగైన శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు హెవీ వెహికిల్స్‌ లారీలు, ట్రక్కులు నడిపేవారికీ నైపుణ్యమైన  శిక్షణ ఇస్తారు.  కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే డ్రైవర్లకు సిరిసిల్లలోనే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే యువకులకు సైతం డ్రైవింగ్‌ స్కూల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది. ఎక్కడైనా బస్సులు, లారీలతో ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు పనిష్మెంట్‌లో భాగంగా సిరిసిల్లలో డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఏటా ఇక్కడ వెయ్యి మందికి శిక్షణ ఇస్తారు.

పరిశోధన సంస్థగా..
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్‌ ట్రాక్, టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్, శిక్షణ పొందేవారికి హాస్టల్‌ వసతి, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు రూ.16.48 కోట్లు కేటాయించారు. ఆధునిక రీతిలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోపాటు అశోకా లేలాండ్‌ సంస్థ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని స్థాపించేందుకు ముందుకొచ్చింది. దీనితో తెలంగాణలోని 31 జిల్లాల యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ పొందే వీలుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తారు. సిరిసిల్ల జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్‌ డ్రైవింగ్‌ విధానాలను అధ్యయనం చేయడంతోపాటు ఇక్కడ డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు.

చురుగ్గా పనులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మంజూరు చేయించారు. ప్రస్తుతం డ్రైవింVŠ  శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రహరీ నిర్మాణం, మెయిన్‌ బ్లాక్, భవనాలు నిర్మిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణాశాఖ ప్రధాన కార్యాలయాన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ, వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు ఇక్కడే చేయనున్నారు. ఈ శిక్షణ కేంద్రం, పరిశోధనలతో స్థానిక యువతకు మెరుగైన డ్రైవింగ్‌ విధానాలు దరిచేరనున్నాయి.

 డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం స్వరూపం
స్థలం              : రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లి
నిర్మాణ వ్యయం : రూ.16.48 కోట్లు
విస్తీర్ణం            : 20 ఎకరాల్లో..
నిర్మాణ గడువు : ఏడాదిన్నర కాలం
ప్రయోజనం      : డ్రైవింగ్‌లో ఆధునిక శిక్షణ, నైపుణ్యం పెంపు
ఎంత మందికి   : ఏటా వెయ్యి మందికి  
నిర్వహణ        : రవాణాశాఖ, అశోకా లేలాండ్‌ సంస్థ
లక్ష్యం             : ప్రమాద రహిత సమాజం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌