amp pages | Sakshi

‘కాళేశ్వరం’తో రాష్ట్రం సస్యశ్యామలం

Published on Sun, 08/05/2018 - 12:00

మహదేవపూర్‌(వరంగల్‌): ప్రపంచంలో అత్యంత వేగవంతంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చరిత్రలో నిలిచిపోతారని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను శనివారం పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. ఉదయం 9 గంటలకు మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డకు చేరుకోవల్సిన పద్మాదేవేందర్‌రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ అధికారులు, ఇంజనీర్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు.  మేడిగడ్డ బ్యారేజీ డిప్యూటీ ఇంజనీయర్‌ సురేష్‌ బ్యారేజీ నిర్మాణ వివరాలను, నీటి ప్రవాహం, రివర్స్‌ పంపింగ్‌ సిస్టమ్‌ ద్వారా గోదావరి, ప్రాణహిత నీటిని తరలించే విధానంపై మ్యాపు ద్వారా వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి రంగంపై దృష్టి సారించలేదని, వలసాంద్రపాలకులు మన నీటిని దోచుకుపోతున్నా..తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షకు గురైన తెలంగాణ ప్రజానీకం ఉద్యమసారధి కేసీఆర్‌ వెంట నడిచి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి రంగ నిపుణులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో గోదావరి నీటి వినియోగంపై చర్చించి ‘వ్యాప్కోస్‌’ సంస్థతో సర్వే చేయించారని అన్నారు. గోదావరిలోని తెలంగాణ వాటా 957 టీఎంసీల నీటిని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని దాంట్లో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి 16 టీఎంసీల నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎగువ ప్రాంతాలకు తరలించాలని ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ను ప్రారంభించారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో 16 జిల్లాలకు సాగు, తాగునీటి వసతి కలుగుతోందని  తెలిపారు. కరువుతో అల్లాడుతున్న మెదక్‌ జిల్లాకు సింగూర్‌ జలాలు మాత్రమే ఉండేవని, గత ప్రభుత్వం సింగూరు జలాలను హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలకు తరలించడంతో పంట భూములన్నీ బీళ్లుగా మారాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్‌ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.  తెలంగాణ రైతాంగం తరుఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆమె వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీపతి బాపు, నాయకులు సుంకె మధు, లక్ష్మణ్, బాబురావు, మాధవరావు తదితరులు ఉన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)