అప్పుల బాధతో కౌలు రైతు మృతి

Published on Mon, 01/26/2015 - 20:25

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన సల్వాల నాంపెల్లి(45) అనే కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపెల్లి గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పుతో పాటు చిన్న కొడుకు నరేశ్‌ను రూ.లక్ష అప్పు చేసి గల్ఫ్‌కు పంపాడు. గల్ఫ్‌లో సరైన పనులు లేక కొడుకు ఇంటికి డబ్బులు పంపలేకపోయాడు. దీనికితోడు కుటుంబ పోషణ భారంగా మారడంతో పూట గడవడం కోసం మరిన్ని అప్పులు చేశాడు.

ఎకరం పొలం కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేశాడు. రెండేళ్లుగా పంట దిగుబడి రాక నిరాశే ఎదురైంది. ఫలితంగా రూ.3లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. దీంతో మనస్తాపం చెందిన నాంపెల్లి సోమవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ