జానాకు సవాల్!

Published on Fri, 05/22/2015 - 03:30

ఎమ్మెల్సీ కైవసానికి రంగంలోకి సీఎల్పీ నేత
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎల్పీ నేత కె.జానారెడ్డి సవాలుగా తీసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బయటకు పోవడం, పార్టీ నాయకత్వ వైఫల్యాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికలపై జానా ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ అభ్యర్థిగా ఆకుల లలిత ఎంపికపై కొందరు పార్టీ నేతలు అసంతృప్తిని వెలిబుచ్చుతున్నందున ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలందరితోనూ స్వయంగా మాట్లాడారు.

గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న సీపీఐ మద్దతు కోసం జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రయత్నించారు. రెండు రోజుల్లో జరిగే పార్టీ సమావేశంలో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలుపొందాలంటే(మొత్తం సభ్యులు ఓటింగులో పాల్గొంటే) 18 ఓట్లు సరిపోతాయని, ఆ మేరకు కాంగ్రెస్‌కు బలముందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అగ్రనేతలు జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 26న జరిగే సీఎల్‌పీ సమావేశంలో చర్చించనున్నారు. గురువారం నాటి భేటీలోనూ పలు అంశాలపై నేతలు చర్చించారు. అధికార టీఆర్‌ఎస్ ఐదుగురిని రంగంలోకి దించినా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు పూర్తయ్యేదాకా వేచి చూడాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో మరుసటి రోజే(26న) సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. కాగా, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకోవడానికే బలం లేకున్నా అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీఆర్‌ఎస్ బరితెగించి ఐదుగురిని బరిలో దింపిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. అధికార టీఆర్‌ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేయాలని చూస్తోందని, అక్రమమార్గాల ద్వారా ఐదో స్థానాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఓట్లు బహిరంగంగా వేయాలని, పార్టీ విప్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)