అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ : ఐదు వేలు దాటిన కరోనా కేసులు
Published on Mon, 06/15/2020 - 22:29
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 219 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది. రాష్ట్రంలో తొలికేసు మార్చి 2న నమోదు కాగా, సరిగ్గా 15 వారాల తర్వాత కేసుల సంఖ్య 5వేలు దాటింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ లోనే అత్యధికంగా 189 ఉండగా..రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్లో 4, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, మహబూబ్నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్ రూరల్, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 187కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 2,766 మంది డిశ్చార్జి కాగా, 2,240 మంది చికిత్స పొందుతున్నారు.
#
Tags