జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
నిజామాబాద్లో కరోనా మరణాల కలవరం
Published on Mon, 07/13/2020 - 21:25
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరగడం కలవరానికి గురిచేస్తోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గడిచిన మూడు రోజుల వ్యవధిలో ఆరుగురు కరోనా బాధితులు మృతిచెందారు. మరోవైపు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా కొత్తగా 33 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 250కి చేరింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైనా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు రాజీనామా చేశారు.
#
Tags