amp pages | Sakshi

ఆచితూచి..!

Published on Sat, 04/20/2019 - 10:23

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థిత్వాల ఖరారుపై కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి వ్యహరిస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన తర్వాత.. కారెక్కని వారి కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే వలసల భయం పట్టుకోగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారికే బీ–ఫారాలు ఇవ్వాలని నిర్ణయించింది. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించకుండా వారి నుంచి బాండ్‌ రాయించుకోవాలని ఇటీవల అధిష్టానం ఆలోచించింది. అయితే న్యాయపర ఇబ్బందులు ఎదురవుతుందనే ఉద్దేశంతో వెనకడుగు వేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ మండల అధ్యక్షులు, నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసింది. వారు మూడు రోజులుగా ఆయా మండలాల్లోని ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి డీసీసీలకు అప్పగించారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కో స్థానం నుంచి  ఇద్దరు, ముగ్గురు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా పలు మండలాల నుంచి దరఖాస్తులు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే వచ్చిన వాటిని ఆయా కమిటీలు పరిశీలిస్తున్నాయి. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఒకరోజు ముందు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించేలా డీసీసీ అధ్యక్షులు కసరత్తు ముమ్మరం చేశారు.

వలసలపై కలవరం!
కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వలసల భయం పట్టుకుంది. ఇప్పటికే 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చాలా మంది గులాబీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 64 జెడ్పీటీసీ స్థానాలుంటే కాంగ్రెస్‌ 28, టీఆర్‌ఎస్‌ 25, టీడీపీ 9 బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో కొలువుదీరిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు ఇరవైకి పైగా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు ఎంపీపీలు సైతం గులాబీ కండువా కప్పుకొన్నారు. ధన్వాడ జెడ్పీటీసీ సభ్యురాలు కవిత, అనితాబాల్‌రాజ్‌ (కోస్గి), లక్ష్మీవెంకటయ్య (నర్వ), ప్రకాశ్‌రెడ్డి (ఊట్కూ రు), లలిత మధుసూధన్‌రెడ్డి (మాగనూరు), సుధాపరిమళ (బిజినేపల్లి), భాస్కర్‌ (మల్దకల్‌) తోపాటు ఇంకొందరు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే వనపర్తి ఎంపీపీ శంకర్‌నాయక్, జానకీరాంరెడ్డి (గోపాల్‌పేట), పద్మమ్మ (ఊట్కూరు), జి.హన్మంతు (మక్తల్‌), మునియమ్మ (నర్వ) సైతం కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే.. వందలాది స్థానాల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన ఎంపీటీసీ సభ్యుల్లో కొందరు ఆ తర్వాత పార్టీని వీడారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే ఏకైక స్థా నం కొల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం నెల రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎదురులేని శక్తిగా ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌కు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పుడు ఆశించిన మేరకు స్థానాలు సాధించలేకపోతే  పార్టీ మనుగడే ప్రశ్నార్థకం కానుంది. దీంతో అభ్యర్థిత్వాల ఖరారును డీసీసీలకే టీపీసీసీ అప్పగించింది. క్షేత్రస్థాయిలో పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారినే బరిలో దింపడంతోపాటు వారి గెలుపునకు సహకరించాలని అధిష్టానం డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎలా ఢీ కొంటుంది? ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)