ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేతలు

Published on Wed, 09/12/2018 - 11:37

జగిత్యాల జిల్లా: కొండగట్టు రోడ్డులో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్‌, టీడీపీ నేతల బృందం బుధవారం సందర్శించి పరిశీలించింది.  అనంతరం మృతుల కుటుంబాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, పెద్దిరెడ్డి, వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌లు పరామర్శించారు. బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాలని ఈ సందర్భంగా నాయకులు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రమాదానికి బాధ్యులైన మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని కోరారు. ప్రభుత్వంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని..లేదంటే ఆర్టీసీ అన్ని డిపోల ముందు ఆందోళనకు దిగి ఆర్టీసీని స్థంభింపజేస్తామని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు హెచ్చరించారు. కొండగట్టు ఘటన దురదృష్టకరమని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని, దీనికి కారకులైన వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు.

అసలే విషాదం.. ఆపై వర్షం
కొండగట్టు ప్రమాదంలో మృతిచెందిన వారి అంత్యక్రియలకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. శనివారం పేట, హిమ్మత్‌ రావు పేట, తిర్మలాపూర్‌, రామ్‌సాగర్‌, డబ్బూతిమ్మాయిపల్లిలో వర్షం జోరుగా పడుతోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)