amp pages | Sakshi

మీ మైండ్‌సెట్‌ మారదా?

Published on Sat, 07/20/2019 - 02:38

సాక్షి, హైదరాబాద్‌ : ‘దేనికైనా వ్యతిరేకంగా మాట్లాడడమే పనిగా పెట్టుకోవడం దుర్మార్గం. ఏం వ్యతిరేకించాలో.. దేన్ని సమర్థించాలో తెలుసుకోవాలి. అడ్డగోలుగా మాట్లాడితే బాగుండదు. మీరు చెప్పింది వినడానికి రాలేదు. ఎవరు చెప్పింది కరెక్టో ప్రజలు తీర్పు చెప్పారు. ఇంకా నాలుగున్నరేళ్లు ప్రభుత్వంలో ఉంటాం’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విపక్షాలపై ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనసభలో పురపాలక బిల్లుపై వివరణ ఇస్తూ.. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులపై కేసులు వేసిందీ.. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సింగరేణిలో కారుణ్య నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అడ్డుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు.

‘ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 200 కేసులు వేశారు. పర్యావరణ అనుమతి లేదని ఒకసారి, అనుమతి ఇస్తే ఎలా ఇస్తారని మరోసారి కేసులు వేసిన దిక్కుమాలిన చరిత్ర మీదికాదా? నిరుద్యోగులు గాంధీభవన్‌ ఎదుట ధర్నా చేసింది నిజం కాదా?’అని సీఎం నిలదీశారు. కాంగ్రెస్‌ ధోరణి చూస్తే మేమేమీ చేయలేదు. మీరూ అలాగే ఉండండి అన్నట్లుందన్నారు. అవినీతిరహిత, జవాబుదారీతనం, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెంపొందించే లక్ష్యంతో మున్సిపల్‌ చట్టం తెస్తే.. దానిని గుడ్డిగా వ్యతిరేకించడం ఎంతవరకు సబబని సీఎం ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ బాగుందని, కొనసాగిస్తామని సభాసాక్షిగా ప్రకటించామని, ఆ స్ఫూర్తి కాంగ్రెస్‌ నేతల్లో లేకపోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. 

పని జరగాలంటే రెండే మార్గాలు
పని జరగాలంటే మనముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి భక్తి, మరొకటి భయం. రెండోదానితోనే పురపాలన గాడిలో పడుతుందని విశ్వసిస్తున్నాం అని సీఎం స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో లంచాల వ్యవస్థ కొనసాగుతోంది. అరాచకాలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. వీటినుంచి విముక్తి కలిగించేందుకు పారదర్శక, సుపరిపాలన అందనుందని అన్నారు. పాలకవర్గాల అధికారాలను హరించేందుకు కలెక్టర్లకు అధికారాలివ్వలేదని, ప్రాధాన్యతలను క్రమపద్ధతిలో నిర్ధారించి మార్గనిర్దేశం చేస్తారని అన్నారు. పరిపాలనలో విశేషానుభవం ఉన్నందున కలెక్టర్లకు ఈ నియంత్రణాధికారాలు కట్టబెట్టినట్లు చెప్పారు.

ప్రజాప్రతినిధుల హక్కులకు ఏలాంటి భంగం కలగదని, ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించేలా పురపాలక చట్టాన్ని తీసుకొచ్చామని కేసీఆర్‌ చెప్పారు. ‘చట్టసభల్లో బీసీలకు 34% రిజర్వేషన్‌ కల్పించాలని భావిస్తే.. సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న దీనిపై చర్చించి సాధిస్తాం’అని సీఎం స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అలాగే ఆస్తిపన్నుపై వడ్డిస్తున్న పెనాల్టీలను మాఫీ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)