amp pages | Sakshi

మాతృభాషలోనే ప్రాథమిక విద్య సాగాలి

Published on Sat, 03/02/2019 - 02:20

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమికవిద్య మాతృభాషలోనే జరగాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్లాటినం జూబ్లీ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీ డిజిటల్‌ లైబ్రరీ, ఏవీ యూట్యూబ్‌ చానల్‌ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘మన విద్యావ్యవస్థ ఇంకా పరాయిపాలన నుంచి పూర్తిగా బయటపడలేదు. చిన్నప్పటి నుంచే ఆంగ్ల మాధ్యమం మోజులో పడి అమ్మభాషను మర్చిపోతున్నారు.

ఈ ధోరణి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అందుకు సరైన మందు ప్రాథమిక విద్యను మాతృభాషలో అమలు చేయడమే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేయాలి. భావవ్యక్తీకరణ, విషయ పరిజ్ఞానం పెరగడం, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడంలో మాతృభాష దోహదపడుతుంది’అని అన్నారు. మాతృభాష కంటిచూపు వంటిదని, పరాయి భాష కళ్లద్దాల వంటిదని, కంటిచూపు లేకుంటే కళ్లద్దాలు ఉన్నా లాభం లేదని చమత్కరించారు. విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుం డా విజ్ఞానం సంపాదించుకోవడం, దేశానికి సేవను అందించడం కోసం ఉండాలన్నారు. 

విద్యాబోధన ఒక మిషన్‌లా ఉండాలి... 
సమాజం అభివృద్ధి చెందాలంటే సరైన విద్య అందించాలని గుర్తించిన పలువురు మేధావులు విద్యాసంస్థలను స్థాపించారని, అందులో భాగంగా ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ తనవంతు పాత్ర నిర్వర్తిస్తోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విద్యాబోధన ఒక మిషన్‌లా సాగాలే కానీ, అది కమీషన్‌ కోసం సాగితే పలు అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం విద్యాసంస్థల్లో ఎక్కడా సరైన మైదానాలు ఉండడంలేదన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యువత వ్యాయామం, యోగాకు సమయం కేటాయించాలన్నారు. తల్లి దండ్రులు, జన్మభూమి, మాతృభాష, గురువు కు గౌరవమివ్వాలని యువతకు సూచించారు. 

విద్యావిధానంలో మార్పులు అవసరం...
మన విద్యావిధానంలో మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మం త్రి జి.జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న విద్యావిధానం పాత పద్ధతిలో ఉందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించాలన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు స్థానం ఉండేది కాదని, కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో సంస్కరణలు జరిగాయన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని, జీవనం, ఉపాధికి సంబంధించిన అంశాలను జోడించి మార్పులు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు కె. ప్రతాప్‌రెడ్డి, సెక్రటరీ కొండా రామచంద్రారెడ్డి, కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, రఘువీర్‌ రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)