amp pages | Sakshi

‘థర్డ్‌ డిగ్రీ’పై రాజీయత్నం!

Published on Sun, 07/23/2017 - 01:15

- రంగంలోకి దిగిన అధికార పార్టీ నేతలు
జైలులో బాధితులతో చర్చలు
ఉద్యోగాలు.. పరిహారం.. కేసుల ఎత్తివేతకు సై
 
సిరిసిల్ల: జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల దళితులపై పోలీసుల ‘థర్డ్‌ డిగ్రీ’ ప్రయోగంపై ‘రాజీ’ యత్నాలు మొదలయ్యాయి. ముఖ్య నాయకుల ఆదేశాలతో అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగారు. ఆందోళనలకు ముగింపు పలికేలా తమతో సహ కరించాలంటూ బాధితు లతో చర్చలు జరిపారు.  కేసులు ఎత్తి వేయిస్తామని, పరిహారం మంజూరయ్యేలా చూస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, అధికార పార్టీ నాయకులు ఆలస్యంగా స్పందించడంపై నిందితులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్లకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు శుక్రవారం కరీంనగర్‌ జైలుకు వెళ్లివచ్చారు.  

పోలీసుల తీరును తప్పు పడుతూనే.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ‘విపక్షాల ఆందోళనకు సహ కరించవద్దు.. వాళ్లు ఇవ్వాల వస్తారు.. పోతారు.. మనమే ఇక్కడ ఉండేది.’అంటూ రాజీ ప్రయ త్నాలు చేసినట్లు సమాచారం. ‘మా పానాలు పోతున్నయి. బొక్కబొక్కకూ పోలీసోళ్లు నీళ్లు పోసిండ్రు.. మాగతి మీకొస్తే తెలుస్తది..’ అంటూ నిందితుల్లో ఒకరు తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. ‘గిప్పుడా మీరు వచ్చేది’ అంటూ మరొకరు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. 
 
బాధిత కుటుంబ సభ్యులతోనూ చర్చలు..
నిందితుల కుటుంబ సభ్యులతో తంగళ్లపల్లి మండల ప్రజాప్రతినిధులు కొందరు చర్చలు జరిపి నట్లు తెలిసింది. నేరెళ్ల, రామచంద్రాపూర్, జిల్లెల్ల గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లా డగా కొందరు రాజీకి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విపక్షాలకు దూరంగా ఉంటే పరి హారం ఇస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామ నడంతో కొందరు అంగీకరించినట్లు సమాచారం.  కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది బాధితుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. పెంట బాణయ్య, చీకోటి శ్రీనివాస్, కోరుగంటి గణేశ్‌ ఆస్పత్రిలోనే ఉన్నారు.
 
పోరుబాటలో విపక్షాలు
థర్డ్‌ డిగ్రీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కాంగ్రెస్‌ సహా బీజేపీ, దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. హైకోర్టులోనూ కేసు ఫైల్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
 
పోలీసులపై చర్యలు..!
థర్డ్‌ డిగ్రీ ప్రయోగంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్నట్లు సమాచా రం. ప్రభుత్వపరంగా గ్రీన్‌సిగ్నల్‌ రాగానే బాధ్యు లపై చర్యలు చేపట్టనున్నారు. బాధ్యు లపై చర్యలు తీసుకుని, నిందితులను ఆదుకునే పక్రియను ఏకకాలంతో చేపట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌