amp pages | Sakshi

మరో బాలిక క్షేమం

Published on Tue, 12/01/2015 - 01:26

వరంగల్ క్రైం : వరంగల్ రైల్వేస్టేషన్‌లో కామాంధుల బారినపడిన ఇద్దరు బాలికల్లో రెండో బాలిక సోమవారం ఉదయం తిరుపతిలోని ఆమె ఇంటికి చేరుకున్నట్లు వరంగల్ పోలీసుల కు సమాచారం అందింది. ఈ నెల 24వ తేదీ రాత్రి వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా 26వ తేదీన విజయవాడలో చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు బాలికను చేరదీసి వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని వరంగల్‌కు రప్పించా రు. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్‌లో కీచకుల బారి నుంచి తప్పించుకున్న బాలి కలు ఇద్దరు ఒకే రైలు ఎక్కారు. ఇద్దరు బాలికలు విజయవాడలో దిగారు. ఒక బాలిక మాత్ర మే చైల్డ్‌లైన్ ప్రతినిధులకు దొరకగా మరో బాలిక విజయవాడలోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని తిరుపతిలోనే ఒక రోజు ఉండి మరుసటి రోజు సోమవారం ఉదయం వారి ఇంటికి చేరుకుందని తెలిపారు. బాలిక క్షేమంగా ఉందని తిరుపతి పోలీసులు వరంగల్ పోలీసులకు సమాచారమిచ్చారు. అయి తే ఇద్దరు కలిసి ఒక రైలులోనే ప్రయాణించి విజయవాడలో దిగినప్పటికీ ఒక బాలిక మాత్రమే చైల్డ్‌లైన్‌కు దొరకడం, మరో బాలిక మాత్రం విజయవాడలోనే మరోచోట ఉండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేగాక 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బాలిక ఎక్కడ ఉంది ? ఆమె ఒక్కతే ఉందా? వరంగల్‌కు చెందిన మరో కీచకుడు ఆమెను తన వెంట తీసుకెళ్లాడా ఇవన్ని ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది. క్షేమంగా ఇంటికి చేరుకున్న బాలికను పోలీసులు విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
 బాలికల గృహ నిర్బంధం కేసులో మిల్స్‌కాలనీ పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విశ్వనాథ్  పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతడి ఆచూకీ కోసం పోలీసుల కూపీ లాగుతున్నారు. వరంగల్ రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్న చిరు వ్యాపారులను పోలీసులు విచారించినట్లు సమాచారం.
 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌