amp pages | Sakshi

ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు!

Published on Tue, 12/17/2019 - 05:11

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ కూడా దీనిపై కసరత్తు చేస్తోంది. వ్యవసాయశాఖ ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశాల్లోనూ ప్రైవేటు వ్యవసాయ కళాశాలల ఏర్పాటు అంశం చర్చకు వచ్చింది. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా ప్రైవేటు అగ్రి కళాశాలల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ‘వ్యవసాయ, ఉద్యాన తదితర అనుబంధ రంగాల కోర్సులకు భారీ డిమాండ్‌ ఉంది.

ఈ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ అగ్రి కాలేజీల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. దీంతో రాష్ట్రంలోనే ఆ కళాశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది’అని వ్యవసాయశాఖ భావిస్తోంది. త్వరలో సీఎం కేసీఆర్‌ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్రైవేటు వ్యవసాయ కాలేజీల ఏర్పా టుకు ముందుకు వచ్చారు. కానీ వాటి ఏర్పాటుపై విధానపర నిర్ణయం తీసుకోనందున వారి విన్న పాన్ని తిరస్కరించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సీట్లు తక్కువ... డిమాండ్‌ ఎక్కువ 
ఇంటర్‌ బైపీసీ పూర్తయిన విద్యార్థులకు ఎంసెట్‌ ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, ఫిషరీస్‌ సైన్స్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని 6 వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌లో 432 సాధారణ సీట్లు, 75 పేమెంట్‌ సీట్లు, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ పరిధిలోని 2 కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్‌ హార్టీకల్చర్‌లో 130 సాధారణ సీట్లు, 20 పేమెంట్‌ సీట్లు ఉన్నాయి. అలాగే పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విద్యాలయం పరిధిలోని 3 కళాశాలల్లో బీవీఎస్‌సీ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీలో 158 సీట్లు, వనపర్తి జిల్లా పెబ్బేరు, ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్లలోని ఫిషరీస్‌ సైన్స్‌ కళాశాలల్లోని బీఎఫ్‌ఎస్‌సీలో (తెలంగాణ కోటా) 36 సీట్లలో ప్రవేశానికి అవకాశముంది.

ఈ ఏడాది బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌లో 25 సీట్లు ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్‌ కోటా కింద భర్తీకి అవకాశం కల్పించారు. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు ఫీజు రూ. 34 లక్షలు, పేమెంట్‌ సీట్లకు రూ. 14 లక్షల చొప్పున వసూలు చేయాలని వర్సిటీ ఈ ఏడాది నిర్ణయించింది. తెలంగాణలో ఈ ఏడాది బైపీసీ వార్షిక పరీక్షలో పాసైనవారు 62వేల మంది ఉన్నారు. వారు కాకుండా గతంలో ఫెయిలై తిరిగి పరీక్ష రాసిన వారు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసినవారు మరో 40 వేల మంది ఉన్నారు. అంటే లక్ష మందికిపైగా బైపీసీ పూర్తి చేశారు. వారిలో చాలామంది సాధారణ బీఎస్సీ డిగ్రీకి బదులు ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

కానీ ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో 4,670 సీట్లు, డెంటల్‌లో 1,140 సీట్లు, ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో 655 సీట్లున్నాయి. అన్ని మెడికల్‌ సీట్ల సంఖ్య 6,465 ఉన్నాయి. ఈ ఏడాది నీట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన వారు ఏకంగా 37 వేల మంది ఉన్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో మెడికల్‌లో సీట్లు రాని వారిలో వేలాది మంది వ్యవసాయ కోర్సులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా సీట్లు రాని వారంతా ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు వ్యవసాయ కోర్సులు చదువుతున్నారు.

పరిశీలనలో ఉంది.. 
ప్రైవేటు వ్యవసాయ కాలేజీల ఏర్పాటు అంశం జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలనలో ఉంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం జరగలేదు. – వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

కొందరు సంప్రదించారు... 
ప్రైవేటు కాలేజీల ఏర్పాటు కోసం కొందరు సంప్రదించిన మాట వాస్తవమే. అయితే ప్రైవేటు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనందున ఆయా విన్నపాలను తిరస్కరించాం. 
– పార్థసారధి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)