amp pages | Sakshi

‘గళం’ విప్పేదెవరో..!

Published on Fri, 03/15/2019 - 14:56

సాక్షి, మంచిర్యాల:  శాసనమండలిలో గళం విప్పేందుకు ఉబలాటపడుతున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్‌కు కేవలం వారం రోజులే వ్యవధి ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓట్ల వేటను వేగవంతం చేశారు. సాధారణ ఓటర్లకు భిన్నంగా పట్టభద్రుల ఓటర్లను దొరకపట్టడమే గగనమవుతున్న తరుణంలో అన్ని రకాల ప్రచారాస్త్రాలను వినియోగించుకొంటున్నారు.

 
ప్రచారం ముమ్మరం
శాసనమండలి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టభద్రుల నియో జకవర్గ స్థానానికి తలపడుతున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఆలోగా వీలైనంతమంది ఓటర్లను కలుసుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు. సాధారణ ఎన్నికల్లోనైతే ఓటర్లంతా ఒక గ్రామంలోనో, పట్టణంలోనో ఉంటారు. కాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కడుంటారో దొరకబట్టడమే అభ్యర్థులకు కష్టంగా మారింది.

దీంతో ఓట్ల సమూహాలను గుర్తించేందుకు అభ్యర్థుల మద్దతుదారులు నానాతిప్పలు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల కరస్పాండెంట్లు, విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదుల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రధానంగా నలుగురు అభ్యర్థుల నడుమ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ వేత్త టి.జీవన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ నేత పి.సుగుణాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ మద్దతుతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ పోటీలో ఉన్నారు.

వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ  నెల 22వ తేదీన ఎమ్మెల్సీ పోలింగ్‌ ఉండడంతో, అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగిరం చేశారు. ఇప్పటికే ఓ మారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రచారం పూర్తి చేసిన అభ్యర్థులు, రెండవసారి ప్రచారం చేపట్టారు. గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి మంచిర్యాలలో ప్రచారం నిర్వహించారు. ముందుగా మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

అక్కడి నుంచి కోర్టుకు వెళ్లి న్యాయవాదుల మద్దతు కోరారు. స్వతహాగా న్యాయవాది అయిన జీవన్‌రెడ్డికి లాయర్లు స్వాగతం పలికారు. అనంతరం విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతు కోసం తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలంటూ అభ్యర్థించారు. కాగా మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ ఈ నెల 13న నిర్మల్‌లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి పి.సుగుణాకర్‌రావు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో ఇప్పటికే ప్రచారం చేపట్టారు.

పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులంతా మండలిలో తమకు గళం విప్పే అవకాశం ఇవ్వాలంటూ ఓటు అభ్యర్థిస్తున్నారు. పట్టభద్రుల వాణిని మండలిలో వినిపించేందుకు తమకు పట్టం కట్టాలంటూ కోరుతున్నారు. ముఖ్యంగా సీనియర్‌ రాజకీయ వేత్త, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించే గొంతు కోసం తనకు ఓటేయాలంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతోపాటు తనకున్న వ్యక్తిగత చరిష్మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందనే భరోసాతో ఆయనున్నారు. అంతా అధికారపక్షంగా ఉన్న సమయంలో మాట్లాడే ఓ ప్రతిపక్ష గొంతు కావాలంటూ ప్రచారాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇక టీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలో ఉన్న చంద్రశేఖర్‌గౌడ్, సైతం పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు తనకు చాన్స్‌ ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన తనకు అన్ని అంశాలపై అవగాహన ఉందంటున్నారు. బీజేపీ జాతీయ నేత  పి.సుగుణాకర్‌రావు సైతం మండలిలో ప్రశ్నించే గొంతుకు అవకాశం కల్పించాలని కోరారు. రాణి రుద్రమ యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొన్నారు. మొత్తానికి మండలి పోలింగ్‌కు కేవలం వారం రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)