అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published on Sun, 03/01/2015 - 19:44

ఖమ్మం: పండిన పంటకు గిట్టుబాటు ధర లేక...అప్పు తీర్చే మార్గం కానరాక ఆ రైతు పంట చేలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు...ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలప్పేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివీ... గ్రామానికి చెందిన పాలెపు పుల్లారావు (40) తనకున్న ఎకరం పొలంలో మిర్చి సాగు చేశాడు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పత్తి ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉంది. ధర కూడా తక్కువగానే ఉంది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు, కౌలు చెల్లింపు కోసం తీసుకొచ్చిన అప్పులు రూ.5 లక్షలకు చేరుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు శనివారం రాత్రి మిరపతోటలో పురుగుమందు తాగి తనువు చాలించాడు.
(తల్లాడ)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ