amp pages | Sakshi

రంగారెడ్డి నుంచి 87 మంది..

Published on Wed, 04/01/2020 - 11:50

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన ఆధ్యాత్మిక ప్రార్థనలో జిల్లా చెందిన వారు పాల్గొని రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి Ððవెయ్యిమందికిపైగా పాల్గొని ఇటీవలే స్వస్థలాలకు వచ్చారు. ఈ జాబితాలో జిల్లాకు చెందిన వారు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంతో జిల్లాలో భయాందోళన పరిస్థితులునెలకొన్నాయి. మహమ్మారి కరోనా వైరస్‌ బారినపడి పలు జిల్లాలకు చెందిన వారు మరణించడంతో జిల్లా వాసుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.

జిల్లా నుంచి 87 మంది మర్కజ్‌లో జరిగిన
ఆధ్యాత్మిక ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే ప్రాంతాలవారు కాగా.. 13 మంది మాత్రమే మున్సిపాలిటీలు, గ్రామాలకు చెందినవాళ్లని తేల్చారు. మైలార్‌దేవ్‌పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, సులేమాన్‌నగర్, జల్‌పల్లి, షాద్‌నగర్, నందిగామ, చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌  తదితర ప్రాంతాలవారు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది ప్రార్థనల్లో పాల్గొన్నారని, మరో పది శాతం మంది వారి తోటి ప్రయాణికులుగా పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.

84 మంది హోం క్వారంటైన్‌లో..
ప్రభుత్వమిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులు, జిల్లా రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఒక్కరోజులోనే వీరందరినీ గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి పంపారు. స్వలంగా వ్యాధి లక్షణాలు గల ఇద్దరి నుంచి మాత్రమే నమూనాలు సేకరించి పరీక్షించగా.. నెగెటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి వెల్లడించారు. మిగిలిన వారిలో వ్యాధి లక్షణాలు లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదు. అలాగే 60 ఏళ్ల పైబడిన ముగ్గురిని మాత్రమే ముందు జాగ్రత్త చర్యగా గాంధీలో ఇన్‌పేషంట్లుగా చేర్చారు. మిగిలిన వారందరికీ ‘హోం క్వారంటైన్‌’ విధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కనీసం 14 రోజులు.. గరిష్టంగా 21 రోజులపాటు వీరంతా ప్రత్యేక గదిలోనే గడపాల్సి ఉంటుంది. 

కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆరా..
ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని విడతల వారీగా ఈనెల 18, 20 తేదీల్లో వచ్చారు. అప్పటికే కరోనా వ్యాప్తిపై విస్తృతంగా ప్రచారం జరగడంతో వీళ్లంతా ఇతరులకు దూరం పాటించినట్లు తెలిసింది. ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఎవరితో సన్నిహితంగా మెలగలేదని అధికారుల విచారణలో తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముందుజాగ్రత్తగా వీరి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఆరాతీశారు. దాదాపు 250 మందిలో ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు లేకపోవడంతోపాటు అనారోగ్యంగా లేరని తెలిసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయినా కొన్ని రోజులపాటు వీరిపై వైద్య సిబ్బంది కన్నేసి ఉంచుతారు. అలాగే ఈ కుటుంబాలు నివసిస్తున్న ఇరుగు పొరుగు వారి ఆరోగ్య పరిస్థితిని బుధవారం తెలుసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయిచింది. 

కలెక్టరేట్‌ నుంచి పర్యవేక్షణ..
ఢిల్లీలో జరిగిన జమాతే సభలో పాల్గొని వచ్చినవారి వివరాలను కలెక్టరేట్‌ నుంచి కమిషనర్‌ సజ్జనార్, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ ఆరాతీశారు. కందుకూరు, రాజేంద్రనగర్‌ డివిజన్ల పరిధిలో హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని సర్వేలెన్స్‌ బృందాలు పరిశీలించాయని, వీరిలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులులేవని తెలిపారు. ఆమనగల్లు మండలంలో హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని వైద్య బృందాలు తనిఖీ చేశాయి. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)