amp pages | Sakshi

3.52 కోట్ల మొక్కలు రెడీ

Published on Fri, 07/03/2015 - 00:55

సర్వం సిద్ధం
- ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి
- నేడు మెదక్‌లో ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
- 4న సిద్దిపేటకు సీఎం కేసీఆర్
- కలెక్టర్ రాహుల్ బొజ్జా వెల్లడి
సంగారెడ్డి క్రైం:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇందుకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమమైనా జయప్రదమవుతుంద న్నారు. కలెక్టరేట్‌లో గురువారం  ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వందలో మూడో వంతు చెట్లు వుంటాయని అన్నారు. చెట్లు విరివిగా వుంటే పర్యావరణ పరిరక్షణతో పాటు సకాలంలో వర్షాలు కురిసి ఆ దేశం సుభిక్షంగా వుంటుందన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం 20 శాతం మాత్రమే పచ్చదనం వుందని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హరిత హారం కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఈనెల 4న సిద్దిపేట నియోజకవర్గంలో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్  వరకు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల నుంచి 50వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. 450 నర్సరీల్లో 250 అటవీ శాఖ, 200 డోమా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రైతులు పొలాల్లో టేకు, యూకలిప్టస్ మొక్కలు, రహదారుల వెంట పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పండ్ల మొక్కలను ఎంపిక చేశామన్నారు.

జిల్లాలో దాదాపు 4.70లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు వున్నారని, ప్రతి ఇంటికి 5 నుంచి 10 మునగ, కరివేపాకు, మామిడి, సపోటా, అంజూర పండ్ల మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటేందుకు కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. గృహాల్లో స్థలం లేని వారికి క్రీపర్లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కింద ఇప్పటివరకు 900 చెరువులను పునరుద్ధరించామని, వాటి కి చుట్టూ ఈత, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని పారశ్రామిక వాడల్లో పది లక్షల మొక్కలు నాటేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని, లక్ష ట్రీగార్డులను సమకూరుస్తున్నారని చెప్పారు.

జిల్లాలో రిజర్వు ఫారెస్ట్ కేవలం పది శాతం వున్నందున రూట్‌స్టాక్ ఉన్న మొక్కలన్నింటినీ పురుద్ధరిస్తామని అన్నారు. పదివేల ఎకరాల్లో పెద్ద ఎత్తున ట్రెంచ్ కటింగ్ కూడా చేస్తున్నామన్నారు. ఫారెస్ట్ చుట్టూ రక్షణగా గచ్చకాయ మొక్కలను పెంచేందుకు ఇప్పటికే రెండు లక్షల మొక్కలను కూడా అందుబాటులో వుంచామని చెప్పారు. అనంతరం స్వచ్ఛ హరిత మెదక్ పేరిట రూపొందించిన లోగోను కలెక్టర్, జేసీ తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ వెంకట్‌రాంరెడ్డి, డీఆర్‌ఓ దయానంద్, డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, జేడ్పీ సిఇఓ/డోమా పీడీ మధు, వాటర్ గ్రిడ్ ఎస్.ఇ.విజయప్రకాష్  పాల్గొన్నారు.
 
వారానికి సరిపడా గుంతలు..
మొక్కలు నాటేందుకు తొమ్మిది లక్షల గుంతలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. వారం రోజులతో పాటు సెప్టెంబర్ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతున్న దృష్ట్యా గుంతలను తవ్వించి సిద్ధం చేస్తామని వివరించారు. బహిరంగ మల విసర్జన లేని స్వచ్ఛమైన జిల్లాగా మార్చడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. లక్ష మరుగుదొడ్లు నిర్మించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు.

Videos

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)