amp pages | Sakshi

‘రెవెన్యూ’పై.. కరోనా పంజా

Published on Sun, 07/12/2020 - 03:17

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి రెవెన్యూ ఉద్యోగులపై పంజా విసిరింది. ఆ శాఖలో అటెండర్‌ మొదలుఆర్డీవో స్థాయి వరకు 126 మంది వైరస్‌ బారినపడగా.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్‌ మల్లేశం మృతితో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సరైన చికిత్స అం దకపోవడమే తహసీల్దార్‌ మరణానికి కారణమని రెవె న్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) తీవ్రంగా ఆరోపించిం ది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌తో కూడిన బెడ్‌ను ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని, ఇలాంటి విపత్కకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అధికారులే...తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమని వ్యా ఖ్యానించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒకట్రెం డు రోజుల్లో సమావేశం నిర్వహించి.. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.తమ వ్యవహారంలో సీఎస్‌ తీరుపై కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. 

నిమ్స్‌లో చికిత్స అందించండి: ప్రజలకు సేవలు అం దిస్తూ కరోనా బారిన పడుతున్న రెవెన్యూ ఉద్యోగులకు నిమ్స్‌ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ‘ట్రెసా’ ప్రతినిధి బృందం కోరింది. కన్నెపల్లి తహసీల్దార్‌ మల్లేశం విషమస్థితిలో వెంటిలేటర్‌ సాయం లభించక గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడం తమకు ఆందోళన కలిగిస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ ఉద్యోగులకు ‘ని మ్స్‌’తో పాటు ‘టిమ్స్‌’లో చికిత్సకు అవకాశం కల్పిస్తామ ని మంత్రి హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ‘ట్రెసా’రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యద ర్శి కె.గౌతమ్‌ కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఉన్నారు.

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)