amp pages | Sakshi

పాలిటెక్నిక్‌లో 21,481 మంది విద్యార్థులు డిటెయిన్‌ 

Published on Thu, 03/07/2019 - 02:56

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థుల్లో 32% మంది డిటెయిన్‌ అయ్యారు. వారికి 75%హాజరు లేకపోవడంతో ఆ విద్యార్థులంతా సెమిస్టర్‌ పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్‌ విద్యార్థులు 68 వేల మంది ఉంటే అందులో 21,481 మంది విద్యార్థులు డిటెయిన్‌ అయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) పేర్కొంది. ఇందుకు బయోమెట్రిక్‌ హాజరు విధానంలో సాంకేతిక సమస్యలే కారణమని కాలేజీల యాజమాన్యాలు చెబుతుండగా, ఆ వాదనను ఎస్‌బీటీఈటీ కొట్టి పారేసింది. అదే నిజమైతే ప్రైవేటు కాలేజీల్లోని 40% మంది విద్యార్థులు డిటెయిన్‌ అయితే, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు 14% మంది మాత్రమే ఎందుకు డిటెయిన్‌ అవుతారని అధికారులు పేర్కొంటున్నారు. పరీక్షలకు అనర్హులైన వీరికి ప్రత్యామ్నాయంగా మళ్లీ ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి పరీక్షలు జరిపేలా ఉన్న తాధికారురలు కసరత్తు చేస్తున్నారు. 

పదే పదే చెబుతున్నా.. 
ఏటా ప్రభుత్వ కాలేజీల్లో 85% విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుండగా, ప్రైవేటు కాలేజీల్లో 45% మంది విద్యా ర్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. దీంతో మొత్తంగా ఉత్తీర్ణత శాతం 65 శాతానికి మించట్లేదు. దీంతో సాంకేతిక విద్యా శాఖ బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి జిల్లాకో టెక్నికల్‌ టీం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు తక్కువ హాజరు ఉందన్న విషయాన్ని నెలవారీగా కూడా వెల్లడిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లూ సాంకేతిక సమస్యల గురించి చెప్పకుండా డిటెయిన్‌ అయ్యాక సమస్యలు ఉన్నాయంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

ఈ ఒక్కసారికే అవకాశం
డిటెయిన్‌ అయిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, బోర్డు కార్యదర్శి వెంకటేశ్వర్లు సమావేశమై చర్చించారు. ఈ పరిస్థితుల్లో అంత మంది విద్యార్థులు డిటెయిన్‌ అయితే నష్టపోతారని, మొదటిసారి కాబట్టి ఒకసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వారికి వచ్చే నెల 15 తర్వాత నుంచి ప్రత్యేకంగా మే నెలాఖరు వరకు నెలన్నర పాటు తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌