amp pages | Sakshi

తమ్ముడి చివరి కోరిక నెరవేర్చిన మహిళ

Published on Mon, 11/20/2017 - 07:30

సేలం : పెద్దల ఆస్తి తోబొట్టువులకు ఇవ్వడానికే నిరాకరించే వారున్న ఈ రోజుల్లో ఓ మహిళ తన తండ్రి, తమ్ముడి చివరి కోరిక మేరకు రూ.కోటి విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాలకు అందించి దాతృత్వం చాటుకున్నారు. ఈరోడ్‌ జిల్లా కాట్టూర్‌కు చెందిన రైతు చిన్ననాచ్చిముత్తు(75) గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు కుమార్తె ఈశ్వరి(52), కుమారుడు నటరాజన్‌(47) ఉన్నారు. నటరాజన్‌ అనారోగ్యం కారణంగా పదేళ్ల పాటు మంచానికే పరిమితమై 2014లో మృతి చెందాడు. నటరాజన్‌ చివరి రోజుల్లో తనకు వాటాగా వచ్చే ఆస్తిని తమ స్వగ్రామమైన ఈరోడ్‌ జిల్లా అమ్మాపాలయంలోని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలని తండ్రికి తెలిపి కన్నుమూశాడు. కుమారుడి చివరి కోరిక నెరవేర్చేందుకు చిన్ననాచ్చిముత్తు తన ఆస్తిలో నటరాజన్‌ వాటాగా రూ.కోటి విలువైన 4.60 ఎకరాల భూమిని అమ్మపాలయంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందే విధంగా వీలునామా రాసి కుమార్తె ఈశ్వరికి అప్పగించాడు.

ఈ క్రమంలో చిన్ననాచ్చిముత్తు మృతి చెందడంతో ఆయన రాసిన వీలునామాను ఇటీవల ఈశ్వరి ఈరోడ్‌ జిల్లా చీఫ్‌ ఎడ్యుకేషన్‌ అధికారికి అప్పగించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆమె మీడియాకు తెలియజేశారు.  ఆ వివరాలు ఆమె మాటల్లో.. ‘‘నా తండ్రి చిన్ననాచ్చిముత్తు చేనేత కార్మికుడు. అతి కష్టం మీద మమ్మల్ని చదివించాడు. నా తమ్ముడు నటరాజన్‌ ఈరోడ్‌లో ప్రైవేటు కళాశాలలో బీబీఎం చదువుకున్నాడు. ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ నేరుగా వెళ్లి చదువుకోలేని పరిస్థితిలో పోస్టల్‌లోనే ఎంబీఎ, ఎంఫిల్‌ను చదువుకున్నాడు. పీహెచ్‌డీ పూర్తి చేసి, ఉద్యోగం చేయాలనేదే నా తమ్ముడి కోరిక. అది నెరవేరకుండానే అనారోగ్యంతో మృతి చెందాడు. తమ్ముడి చివరి కోరిక మేరకు అతని వాటాగా వచ్చిన స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల నిర్వాహకులకు అప్పగించాను’’ అని అన్నారు.

గ్రామస్తుల స్పందన
ఈశ్వరి కావాలనుకుంటే తండ్రి వీలునామాను దాచి ఆస్తిని తానే అనుభవించి ఉండొచ్చని, అయితే తండ్రి, తమ్ముడి చివరి కోరికను నెరవేర్చిన ఈశ్వరికి అభినందనలు తెలిపారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)