చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
Breaking News
తల్లి వైఖరితో విసుగు చెంది...
Published on Sat, 09/05/2015 - 03:37
బెంగళూరు(బనశంకరి) : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తల్లి వైఖరితో విసుగుచెంది రుబ్బుగుండుతో మోది ఆమెను కుమారుడే హతమార్చిన ఘటన రాజగోపాల నగర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... తుమకూరు జిల్లా తిపటూరుకు చెందిన సుశీలమ్మ(40), లగ్గెరెలోని రాజరాజేశ్వరినగరలో నివాసం ఉంటున్న తన కుమారుడు శివకుమార్ వద్ద ఉంటూ, అక్కడి ప్యారాగాన్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె భర్త తిపటూరులో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం శివకుమార్ తిపటూరుకు వెళ్లి గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు.
ఆ సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని గమనించి తల్లిని ప్రశ్నించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాదన తీవ్రస్థాయికి చేరుకోవడంతో పక్కనే ఉన్న రుబ్బుగుండుతో సుశీలమ్మ తలపై శివకుమార్ మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనంతరం ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్లిన శివకుమార్, సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. తన తల్లిని ఎవరో హతమార్చి తాళం వేసుకుని వెళ్లారని నాటకమాడుతూ రాజగోపాలనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులకు శివకుమార్ వైఖరిపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Tags