రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరుప్పస్వామి ఆలయంలో విషాద ఘటన...
Published on Sun, 04/21/2019 - 18:11
చెన్నై: తమిళనాడు తిరుచ్చి సమీపంలోని ముత్యంపాలయంలో విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలోని కరుప్పస్వామి ఆయలంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని తురైయూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కురుప్పస్వామి ఆలయంలో ప్రతి ఏడాది చైత్రమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా హుండీలోని చిల్లరను పంచడం(పడికాసు) ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పూజరి భక్తులకు చిల్లర నాణేలు పంచుతున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
#
Tags