జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేపటి నుంచి మస్తాన్వలి ఉరుసు ఉత్సవాలు
Published on Mon, 05/22/2017 - 16:19
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కోట వీధిలోని ప్రముఖ హజరత్ ఖాజా సయ్యద్ షా మస్తాన్వలి దర్గా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దర్గా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గాను రంగురంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం ఉదయం గంధం, బయాన్ (ధార్మిక ఉపన్యాసం), అన్నదానం నిర్వహిస్తారు.
24వ తేదీ ఉదయం ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాలకు కడప సద్గురు హజరత్ సయ్యద్ షా అరిపుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుస్సేని చిష్టివుర్ఖాద్రితోపాటు పలువురు గురువులు హాజరుకానున్నట్లు దర్గా అధ్యక్షుడు సత్తార్ఖాన్ తెలిపారు. 25న మధ్యాహ్నం తహలీల్ ఫాతెహా జరుగుతుందన్నారు. ఉరుసు ఉత్సవాలకు హిందూముస్లిం సోదరులు హాజరు కావాలని కోరారు.
#
Tags