ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోడా కలిపి.. రక్తం తాగేస్తున్నారు!
Published on Wed, 10/26/2016 - 17:33
ఉడుంపట్టు.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఛత్రపతి శివాజీ సైన్యం కోటగోడలు ఎక్కడానికి ఈ ఉడుములకు తాడుకట్టి, వాటిని ఆ గోడ మీదకు విసిరి.. దాని పట్టుతో తాడు పట్టుకుని పైకి ఎక్కేవారు. అంటే మనిషి బరువును కూడా తట్టుకుని పటిష్ఠంగా కోటగోడను పట్టుకోగల సామర్థ్యం ఉడుములకు ఉంటుంది. అలాంటి ఉడుములను ఇప్పుడు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. తమిళనాడులో అయితే.. ఆ ఉడుము సామర్థ్యం తమకు రావాలని చాలామంది తహతహలాడుతున్నారు. సరిగ్గా ఇదే అంశం కొందరు వ్యాపారులకు కలిసొచ్చింది. వాళ్లు ఉడుముకు ఎంత బలం ఉందో అది మీకు కూడా రావాలంటే తమవద్దకు రావాలని ప్రచారం చేస్తున్నారు.
అక్కడకు వచ్చినవారికి ఉడుమును చంపి, దాని రక్తాన్ని ఒక గ్లాసులో సగం వరకు నింపి ఇస్తున్నారు. అలా వచ్చినవాళ్లు కూడా మిగిలిన సగం గ్లాసులో సోడా కలుపుకొని, ఆ రక్తాన్ని ఏదో కూల్డ్రింకో, మద్యమో తాగినంత సులభంగా తాగేస్తున్నారు. ఉడుము రక్తం తాగితే నరాల్లో పటుత్వం పెరుగుతుందని, తమ సామర్థ్యం రెట్టింపు అవుతుందని నమ్మకం ఉండటంతో వాళ్లు దీనికోసం ఎగబడుతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వ్యాపారులు ఉడుములను ఎక్కడినుంచి తెస్తున్నారో గానీ.. అక్కడికక్కడే వాటిని కోసి, రక్తం తీసి గ్లాసుల్లో పట్టి ఇస్తున్నారు. కస్టమర్లు కూడా అందులో సోడా కలుపుకొని బ్రహ్మాండంగా తాగేస్తున్నారు.
#
Tags