amp pages | Sakshi

సామాన్యుల కోసం క్యాంటీన్లు

Published on Sat, 07/04/2015 - 01:01

ఆప్  సర్కారు యోచన

♦ భోజనం ధర రూ. 3-5 మధ్య 
♦ సీఎం ఆదేశం మేరకు {పతిపాదనల్ని రూపొందించిన డీడీసీ!
♦ క్యాంటీన్ ఏర్పాటుకు రూ.10-15 లక్షల అంచనా వ్యయం    
♦ షీలా హయాంలో  30 చోట్ల ‘జన్ ఆహార్’
♦ రూ. 18కే అప్పట్లో భోజనం
♦ ఇప్పుడు అదే బాటలో కేజ్రీవాల్
♦ ఇవి అందుబాటులోకి వస్తే ‘జన్ ఆహార్’ పక్కకే!
 
 సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుడి కోసం నగరంలో త్వరలో క్యాంటీన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ క్యాంటీన్ల ద్వారా రూ. 3 నుంచి రూ. 5కు  సామాన్యులకు భోజనం అందించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశం మేరకు ఢిల్లీ డైలాగ్ కమిషన్ ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిందని అంటున్నారు.

పేదలకు చౌకగా ఆహారాన్ని అందించడం కోసం షీలాదీక్షిత్ అధికారంలో ఉండగా జన్ ఆహార్ పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. ఈ పథకం కింద ఇప్పటికీ 30 చోట్ల భోజనం లభిస్తోంది. జన్ ఆహార్ కింద ఆరు పూరీలు, కూర, పప్పు రూ .18కి విక్రయిస్తున్నారు. ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తే రైతా కూడా లభిస్తుంది. ఆమ్ ఆద్మీ  క్యాంటీన్లను ప్రారంభించాలన్న ప్రభుత్వ యోచనతో జన్ ఆహార్ పథకం మూలనపడే సూచనలు కనిపిస్తున్నాయి.

 అన్నాడీఎంకే సర్కారు తమిళనాడులో నడిపే అమ్మ క్యాంటీన్లపై అధ్యయనం చేసిన  ఢిల్లీ డైలాగ్ కమిషన్ గత నెల 19న ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలిసింది. ఒక్కొక్క క్యాంటీన్ ఏర్పాటుకు రూ. 10 లక్షల నుంచి 15 లక్షల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలుత 10-15 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని డీడీసీ ప్రతిపాదించిందని చెబుతున్నారు. క్రమేణా రాజధానిలో మొత్తం 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఆప్ సర్కారు ఆశిస్తోంది. క్యాంటీన్లలో అమ్మే భోజనం గరిష్ట ధర రూ. 5కు మించకూడదని కూడా ఆప్ సర్కారు భావిస్తోంది. ఈ క్యాంటీన్లలో ఉదయం వేళల్లో పూరీ,  కూర, పచ్చడి, మధ్యాహ్న సమయంలో అన్నం, పప్పు, రాత్రి రొట్టె, కూర, పప్పు లభిస్తాయి. ఆస్పత్రులతోపాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ  కార్యాలయ భవనాల్లోనూ ఈ క్యాంటీన్లను నెలకొల్పుతారు.

Videos

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?