amp pages | Sakshi

బాణసంచాకు 11 మంది బలి

Published on Tue, 05/05/2015 - 23:48

- మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తి
- కొన్ని మీటర్ల మేర ఎగిరిపడిన మృతదేహాలు
- సాంగ్లీ జిల్లా తాస్‌గావ్ తాలూకా కవాతే ఏకంద్‌లో ఘటన
- టపాసుల తయారీకి ఆ గ్రామం ప్రసిద్ధి..
- అనుమతి లేని తయారీ కేంద్రాలెన్నో.. పట్టించుకోని అధికారులు
సాక్షి, ముంబై:
భద్రత లేని టపాసుల కేంద్రంలో పనిచేస్తూ మరోమారు బడుగుజీవులు అసువులు బాసారు. బతుకుతెరువు కోసం వెళ్లి మంటలకు ఆహుతయ్యారు. సాంగ్లీ జిల్లా తాస్‌గావ్ తాలూకా కవాతే ఏకంద్‌లోని ‘ఈగల్ ఫైర్ వర్క్స్’ టాపసుల తయారీ కంపెనీలో సంభవించిన భారీ పేలుడులో 11 మంది మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి శరీరాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలి రక్తపు మరకలతో మాంసపు ముద్దలతో హృదయవిదారకంగా మారింది. రెండు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాస్‌గావ్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ పాటిల్ ‘సాక్షి’కి ఫోన్‌లో అందించిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా ఈగల్ ఫైర్ కంపెనీలో పేలుడు సంభవించింది.

దీంతో మొత్తం కవాతే ఏకంద్ గ్రామంతా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఈగల్‌ఫైర్ వర్క్స్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి గ్రామస్తులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొద్ది సేపటికే అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. ఈ ఘటనలో ప్రమాదస్థలిలోనే ఆరుగురు మరణించగా, తీవ్రగాయలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరో అయిదుగురు మరణించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతులు అనికేటి గురవ్(16), శరత్ గురవ్(30), ఇందూబాయ్(60), జిబిదా నదాబ్(53),సునందగిరి(45), శంభుగిరి, రామగిరి అని పోలీసులు తెలిపారు. మిగతా నలుగురు మృతుల పేర్లు తెలియ రాలేదు.

భద్రత లోపమే...?
భద్రత, నియమాల ఉల్లంఘనలే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈగల్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన పేలుడుకు కారణాలు ఏవన్నది ఇంకా తెలియరాలేదు. టపాసుల తయారీకి కవాతే ఏకంద్ గ్రామం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ అనేక టపాసుల తయారీ ఫ్యాక్టరీలున్నాయి. కానీ ఏ ఫ్యాక్టరీలోనూ నిర్దేశించిన భ ద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అనుమతి లేకుండా ఇష్టారీతిన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం, నిర్దేశింన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్ల కిందట ఇదే గ్రామంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. పదేపదే ఇలాంటి ఘటనలు జరిగినా మేలుకోని అధికారులు, ఫ్యాక్టర్లీ యజమానులు భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుమతి లేకుండానే చాలా ఫ్యాక్టరీల్లో టపాసులు తయారీ చేస్తున్నట్టు ఆరోపణ ఎప్పటి నుంచో ఉన్నాయి. పేలుడుకు సంబంధించి కంపెనీ యజమానిపై తాస్‌గావ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌