amp pages | Sakshi

ఢమాల్...

Published on Sat, 10/25/2014 - 02:22

సాక్షి,బెంగళూరు : ఈ ఏడాది దీపావళి నగరవాసులకు కొంత సంతోషాన్ని, మరి కొంత విచారాన్ని మిగిల్చింది. గత ఏడాదితో పోలిస్తే టపాసులు కాల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా చూపు పోగుట్టుకున్న వారి సంఖ్య చాలా తగ్గింది. అయితే  అదే సందర్భంలో శబ్ద కాలుష్యం మాత్రం పెరిగినట్లు కర్ణాటక రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (కేఎస్‌పీసీబీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీపావళి సమయంలో టపాసుల వల్ల ప్రమాదాలకు గురై చాలా సందర్భాల్లో చిన్నారులు గాయపడుతుండటం తెల్సిందే. బెంగళూరు ఇందుకు మినహాయింపు కాదు.

అందులోనూ తమిళనాడు సరిహద్దు దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఎక్కువ పరిమాణంలో టపాసులు తీసుకువచ్చి నగరవాసులు కాల్చేవారు. దీంతో రాష్ట్రంలో మిగిలినపాంతాలతో పోలిస్తే బెంగళూరులో ‘దీపావళి’ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నగరంలోని మింటో ఆస్పత్రిలో ఏకంగా ఒక ప్రత్యేక వార్డునే ఏర్పాటు చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే గత మూడేళ్ల నుంచి ‘ప్రమాద రహిత దీపావళి’ గురించి పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.

పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై అనేక ఎన్‌జీఓలు సమాచారాన్ని అందజేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కూడా దీపావళికి రెండు రోజుల ముందు నుంచే విద్యార్థుల్లో సేఫ్ దీపావళి ఆవశ్యకతను తెలియజెప్పుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి ప్రమాదాల సంఖ్య చాలా తగ్గిందని చెప్పవచ్చు. గత ఏడాది దీపావళి సమయంలో  టపాసుల పేలుడు వల్ల గాయపడి 60 మంది మింటో ఆస్పత్రిలో చికిత్స పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 31కు తగ్గిపోయింది. ఈ విషయమై ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న నళిని మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందువల్లే ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అయితే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ఈ విషయంపై మరింత అవగాహన పెంచాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
 
పెరిగిన శబ్ధకాలుష్యం...


రాత్రి పదిగంటల తర్వాత టపాసులు కాల్చరాదని సుప్రీం కోర్టు 2005లోనే ఆదేశిచింది. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఆ ఆదేశాలను పాటిస్తున్న దాఖలాలు లేవు. అర్ధరాత్రి వరకూ టపాసుల మోతతో నగరం దద్దరిల్లుతూనే ఉంది. టపాసుల్లో శబ్ధాన్ని సృష్టించే రసాయనాలు ఏడాదికేడాది పెంచుతూ పోవడం వల్ల  శబ్ధతీవ్రత కూడా అదే రీతిలో పెరుగుతోంది. 2004 నుంచి కేఎస్‌పీసీబీ నగరంలోని ప్రముఖ ప్రాంతాలై వైట్‌ఫీల్డ్, పీణ్యా పరిశ్రామిక వాడలతో సహా పది చోట్ల శబ్ధ, వాయు కాలుష్యాన్ని నమోదు చేస్తోంది.

అందులో భాగంగానే దీపావళి  రోజున కేఎస్‌పీసీబీలో నమోదైన గణాంకాలను అనుసరించి మొత్తం పది చోట్లా కూడా రాత్రి సమయంలో శబ్ధకాలుష్యం పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది. ఐదు చోట్ల సాధారణ రోజుల్లో పగటి సమయం కంటే శబ్ధకాలుష్యం తక్కువగా ఉండటం కూడా గమనించవచ్చు. ఈ విషయమై కేఎస్‌పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ...  పండుగ సెలవు కావడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు తక్కువగా తిరగడం, పీణ్యా వంటి ప్రాంతాల్లో పరిశ్రమల్లో యంత్రాలు పనిచేయకపోవడం తదితర కారణాల వల్ల శబ్ధకాలుష్యం తగ్గింది.

అయితే రాత్రి సమయంలో మాత్రం అన్ని ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం పెరగడానికి టాపాసుల పేలుళ్లే కారణం. ఈ శబ్ధకాలుష్యం పరిమాణం గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా పెరిగింది. దీపావళి రోజున నగరం మొత్తం మీద చిన్నపాటి జల్లులు పడ్డాయి. అందువల్ల వాయుకాలుష్యం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది.’ అని పేర్కొన్నారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)