amp pages | Sakshi

మండలి ఎన్నికలు ఏకగ్రీవం

Published on Wed, 01/21/2015 - 23:30

సాక్షి, ముంబై: విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికల్లో వీరికి పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. మండలి ఉప ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు 20వ తేదీతో ముగిసింది.

చివరి రోజు మంగళవారం శివసేనకు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, శివ్‌సంగ్రాం అధ్యక్షుడు వినాయక్ మేటే, రాష్ట్రీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు మహాదేవ్ జాన్ కర్, బీజేపీ మహిళా ఆఘాడి అధ్యక్షురాలు స్మితా వాఘ్ నామినేషన్లు వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు నలుగురే నామినేషన్ వేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఎమ్మెల్సీలుగా ప్రాతినిథ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే, బీజేపీకి చెందిన ఆశీష్ శేలార్‌లు ఇటీవల శాసనసభకు ఎన్నికయ్యారు. వీరంతా 2014 అక్టోబరు 20వ తేదీనే తమ విధాన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
 
అదేవిధంగా ఎన్సీపీలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వినాయక్ మేటే సభ్యత్వం రద్దయింది. ఇలా మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పృథ్వీరాజ్ చవాన్, వినాయక్ మేటేల పదవీ కాలం 2016 జూలై ఏడో తేదీ వరకు ఉంది. అలాగే ఖాళీ అయిన ఆశీష్ శేలార్ స్థానం గడువు 2018 జూలై 27 వరకు, వినోద్ తావ్డే స్థానం గడువు 2020 ఏప్రిల్ 24 వరకు ఉంది.

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌