ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
మృత్యుంజయుడు
Published on Mon, 11/12/2018 - 12:59
తమిళనాడు, తిరువొత్తియూరు: రెండవ అంతస్థు నుంచి కింద పడిన చిన్నారి స్పల్పగాయంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన చెన్నై మాంబలంలో చోటుచేసుకుంది. వెస్టుమాంబలం ఎం.హెచ్.రోడ్డులో ఉన్న బహుళ అంతస్థు భవనంలో నివాసం ఉంటున్న అరుణ్కుమార్. అతని భార్య పరిమళ. వీరికి ఒకటిన్నర సంవత్సరం కుమారుడు భరత్. వీరు రెండవ అంతస్థులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం భరత్ను బాల్కనీలో నిల్చోబెట్టి తల్లి పరిమళ బిస్కెట్లు తినిపిస్తోంది. పాలు తెచ్చేందుకు పరిమళ భరత్ను అక్కడే వదలి లోపలికి వెళ్లింది. ఆ సమయంలో బాల్కనీలో ఉన్న భరత్ అదుపుతప్పి కిందపడ్డాడు. అదే సమయంలో ఆ మార్గంలో మోటారు సైకిల్పై వచ్చిన వారు చిన్నారిని వెంటనే చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. భరత్ నుదుటిపై స్వల్పగాయమైనట్టు తెలిసింది. అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణగండం నుంచి తప్పించుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Tags