amp pages | Sakshi

‘పులి’తో దోస్తీ కుదిరేనా?

Published on Tue, 10/21/2014 - 01:55

కమలానికి ‘అండ’ ఎవరో..
‘మద్దతు’పై కొనసాగుతున్న ఉత్కంఠ..
షరతులతో మద్దతుకు శివసేన సిద్ధం?

 
సాక్షి ముంబై: మహారాష్ట్రలో అధికారం ఎవరు చేపట్టనున్నారన్నదానిపై గంటగంటకు ఉత్కంఠత తీవ్రమవుతోంది. పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎవరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనునందన్న విషయంపై రాష్ట్రంతో పాటు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఒక వైపు రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమం కోసం బీజేపీకి బయటి నుంచి ఎన్సీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీ మద్దతు తీసుకోవడాన్ని ఆర్.ఎస్.ఎస్. వ్యతిరేకించడంతో పాటు పాతమిత్రులైన శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందా...? శివసేన మద్దతు తీసుకుంటుం దా...? లేదా చిన్న పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.
 
బీజేపీ మద్దతుకు శివసేన సిద్ధమే...
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కన్నేసి ఉంచిన శివసేన ఆచి తూచి అడుగులు వేస్తోంది. అధికారంలో కీలక శాఖలు లభించినట్లయితే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన ప్రకటించింది. అయితే బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వచ్చినట్లయితే ప్రతిపాదనను పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలుపుతామని శివసేన నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సోమవారం మాతోశ్రీలో శివసేన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో పొత్తులపై చర్చలు జరిపినట్లు సమాచారం.  
 
135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది-కిరీట్ సోమయ్య
బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధీమాను ఆ పార్టీ నాయకుడు కిరీట్ సోమయ్య వ్యక్తం చేశారు. తమకు 122 స్థానాలు ఉన్నాయని, దీంతో పాటు మిత్ర పక్షాలు, ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు తమకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు 135 సంఖ్యా బలమైతే ఉందని ఆయన పేర్కొనడం విశేషం.
 
ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే బీజేపీలో......
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పరువు కాపాడిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శరత్ సొనావణే బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలిసింది. బీజేపీ అధికారం చేపట్టేందుకు అనేక మందిని సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జున్నర్‌లో ఎమ్మెన్నెస్ టికెట్‌పై గెలిచిన శరత్ సొనావణేను సంప్రదింపులు జరిపింది.
 
ప్రతిపక్షంలో ఎవరు?
శాసనసభ ఎన్నికల ఫలితాల వెల్లడి ఆదివారం రాత్రి వరకు ముగియడంతో ఇక ప్రతిపక్ష హోదాలో ఎవరు కొనసాగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తర్వాత స్థానంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయి. ఒకవేళ చర్చలు సఫలమై పాతమిత్రులైన బీజేపీ, శివసేన జతకడితే మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది. ప్రతిపక్షంలో తామే కొనసాగుతామని కాంగ్రెస్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా, బీజేపీకి బేషరతుగా బయటనుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్సీపీ ప్రకటించింది. ఒకవేళ  బీజేపీ ఆ పార్టీ మద్దతు తీసుకుంటే ఇక ప్రతిపక్షంలో శివసేన కొనసాగుతుంది. ఒకవేళ బీజేపీకి శివసేన మద్దతు ఇచ్చినా మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్సీపీ కంటే కాంగ్రెస్‌కు ఒక సీటు మాత్రమే ఎక్కువ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎన్సీపీతో జతకట్టిన హితేంద్ర ఠాకూర్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరి మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ కంటే ఎన్సీపీ వద్ద ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దీంతో ఎన్సీపీ కూడా ప్రతిపక్షం హోదాపై కన్నేసే ఆస్కారముందని చెప్పవచ్చు. ఏదేమైనా, బీజేపీ ఎవరి మద్దతు తీసుకుంటుందో తేలిన తర్వాతే ప్రతిపక్ష హోదాపై ఒక స్పష్టత వస్తుంది.
 
ఎమ్మెల్యేలుగా ఆరుగురు కార్పొరేటర్లు
ఈ ఎన్నికల్లో 23 మంది బీఎంసీ కార్పొరేటర్లు బరిలో దిగినప్పటికీ ఐదుగురిని మాత్రమే విజయం వరించింది. దహిసర్ నియోజక వర్గం నుంచి మనీషా చౌదరి, పశ్చిమ అంధేరి నుంచి అమిత్ సాటం, సైన్ కోలివాడ నుంచి ఆర్.తమిల్ సెల్వం, గోరేగాం నుంచి గెలిచిన విద్యా  ఠాకూర్ బీజేపీ వారు కాగా, శివసేన తరఫున పశ్చిమ భాండూప్ నుంచి అశోక్ పాటిల్, దిండోషి నుంచి సునీల్ ప్రభు ఉన్నారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలుపొందారు. బీజేపీకి చెందిన వినోద్ తావ్డే(బోరివలి), ఆషిష్ షెలార్(పశ్చిమ బాంద్రా), కాంగ్రెస్‌కు చెందిన డి.పి.సావంత్(ఉత్తర నాందేడ్) వీరిలో ఉన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)