amp pages | Sakshi

శ్రీకాంత్ x కశ్యప్

Published on Sun, 01/25/2015 - 00:29

మారిన్‌తో సైనా తుదిపోరు
 
లక్నో: సయ్యద్ మోడి స్మారక ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ఆటగాళ్ల ఖాతాలోకే చేరనుంది. హైదరాబాద్‌కే చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లడం విశేషం. 2012లో చాంపియన్‌గా నిలిచిన కశ్యప్ రెండోసారి అంతిమ సమరానికి సిద్ధమయ్యాడు.

శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ శ్రీకాంత్ 12-21, 21-12, 21-14తో ప్రణయ్ (భారత్)పై నెగ్గగా... మూడో సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 22-20, 21-7తో రెండో సీడ్, ప్రపంచ 10వ ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్, కశ్యప్ తొలి గేమ్ కోల్పోయి తర్వాతి రెండు గేములను సొంతం చేసుకోవడం విశేషం.
 
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ (భారత్), ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) మధ్య టైటిల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సైనా 21-10, 21-16తో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... మూడో సీడ్ పి.వి.సింధు 13-21, 13-21తో మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. మారిన్ చేతిలో సింధుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ చేతిలోనే సింధు ఓడిపోయింది.  
 
జ్వాల జంట ఓటమి
మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 16-21, 21-19, 21-13తో అమిలియా అలిసియా-ఫీ చో సూంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 12-21, 18-21తో ఇవనోవ్-సొజొనోవ్ (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో కె.మనీషా-మనూ అత్రి (భారత్) జంట 24-22, 21-19తో డ్రెమిన్-దిమోవా (రష్యా) జోడీని ఓడించి ఫైనల్‌కు చేరింది.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)