లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చల చల్లగా... సరదా సరదాగా...
Published on Fri, 02/09/2018 - 03:28
స్విట్జర్లాండ్లోని సెయింట్ మోరిట్జ్లో ఐస్ క్రికెట్ సరదాగా సాగింది. గడ్డకట్టిన సరస్సుపై ఏర్పాటు చేసిన మ్యాటింగ్ వికెట్పై మైనస్ 12 డిగ్రీల హిమతాపంలో క్రికెట్ దిగ్గజాలు టి20 మెరుపులతో అలరించారు. డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ (31 బంతుల్లో 62) ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపెట్టాడు. అయితే వీరూ జట్టుపై ఆఫ్రిది జట్టు గెలుపొందడం విశేషం.
మొదట సెహ్వాగ్ ప్రాతినిధ్యం వహించిన డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో రజాక్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆఫ్రిది, అక్తర్లున్న రాయల్స్ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ఓవైస్ షా (34 బంతుల్లో 74), కలిస్ (26 బంతుల్లో 36) ధాటిగా ఆడారు. శుక్రవారం రెండో టి20 జరుగుతుంది.
#
Tags