అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సైనాకు షాక్
Published on Fri, 06/29/2018 - 04:06
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 15–21, 13–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటి వరకు ఏడుసార్లు యామగుచితో తలపడిన సైనా వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడింది. ఇతర మ్యాచ్ల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21–8, 21–14తో యింగ్ యింగ్ లీ (మలేసియా)పై; పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 22–20, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్కు అర్హత సాధించారు.
#
Tags