సలామ్‌ బాస్‌: రిషభ్‌

Published on Mon, 07/22/2019 - 10:31

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత మహిళా అథ్లెట్‌ హిమ దాస్‌ మూడు వారాల వ్యవధిలో ఐదో స్వర్ణాన్ని గెలిచి  శభాష్‌ అనిపించారు. చెక్‌ రిపబ్లిక్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో హిమ దాస్‌ 400 మీటర్ల రేసులో తొలి స్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకున్నారు. 200 మీటర్ల రేసులో నాలుగు స్వర్ణాలు సాధించిన హిమదాస్‌.. 400 మీటర్ల రేసులోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. భారత కీర్తిని మరింత పెంచిన హిమ దాస్‌ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో స్పందిస్తూ.. ‘ నీవే ఒక స్ఫూర్తి.  ద గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా.. సలామ్‌ బాస్‌’ అంటూ కొనియాడాడు.

‘ గత 19 రోజుల కాలంలో యూరోపియన్‌ సర్క్యూట్‌లో నీ ప్రదర్శన చూసి గర్విస్తున్నాం. గెలవాలనే నీలో కసి యువతకు ఒక స్ఫూర్తి. ఐదు పతకాలు గెలిచినందుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నా’ అని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: నచ్చారండి.. హిమదాస్‌)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ