కేకేఆర్‌ విజయలక్ష్యం 140

Published on Sun, 04/07/2019 - 21:37

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 140 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్‌ అజింక్యా రహానే(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం జోస్‌ బట్లర్‌తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత బట్లర్‌(37) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.

అయితే స్మిత్‌ మాత్రం నిలకడగా ఆడాడు. రాహుల్‌ త్రిపాఠీతో కలిసిన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. రాజస్తాన్‌ స్కోరు 105 పరుగుల వద్ద త్రిపాఠి(6) ఔట్‌ అయ్యాడు. కాగా, స్మిత్‌(73 నాటౌట్‌; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) చివర వరకూ క్రీజ్‌లో ఉండటంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో గర్నీ రెండు వికెట్లు సాధించగా, ప్రసిద్ద్‌ క్రిష్ణకు వికెట్‌ దక్కింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ