వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాంజల జోడీకి టైటిల్
Published on Sat, 08/11/2018 - 10:18
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డబుల్స్ కేటగిరీలో భారత్కు చెందిన రుతుజా భోసాలేతో జతకట్టిన ప్రాంజల టైటిల్ను గెలుచుకోగా... సింగిల్స్ విభాగంలో సెమీస్లో పరాజయం పాలైంది.
థాయ్లాండ్లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ ప్రాంజల–రుతుజ ద్వయం 2–6, 6–0, 10–6తో టాప్ సీడ్ బైన్స్ నయ్క్తా (ఆస్ట్రేలియా)–స్టెఫ్కోవా బార్బోరా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొంది చాంపియన్గా నిలిచింది. మరోవైపు మహిళల సింగిల్స్ సెమీస్లో ప్రాంజల 3–6, 6–2, 2–6తో వాంగ్ జియు (చైనా) చేతిలో ఓటమి పాలైంది.
#
Tags