'పాక్- జింబాబ్వే క్రికెట్ మ్యాచ్' లక్ష్యంగా దాడి

Published on Sat, 05/30/2015 - 10:44

పాకిస్థాన్- జింబాబ్వేల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగుచూసింది. శుక్రవారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఈ రెండు జట్లు రెండో వన్ డే ఇంటర్నేషన్ మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఉగ్రవాది అక్కడిక్కడే తనను పేల్చుకున్నాడు.

ఈ దాడిలో ఒక  ఎస్సై మరణించగా, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇప్పటికే పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు అన్నిదేశాలు నిరాకరించిన నేపథ్యంలో పూర్తిస్థాయి భద్రత హామీపై జింబాబ్వే జట్టు పాక్లో పర్యటిస్తోంది. స్టేడియం సమీపంలో ఉగ్రదాడి విషయం బయటికి వస్తే పరువు మరింత దిగజారుతుందని భావించిన పాక్ ప్రభుత్వం సంబంధిత వార్తలను ప్రసారం చెయ్యొద్దని బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ను ఆదేశించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ