అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ముగ్గురికి ఐసీసీ క్లీన్చిట్
Published on Mon, 06/29/2015 - 23:48
దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లు భారీ స్థాయిలో ముడుపులు స్వీకరించారన్న లలిత్ మోదీ ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. వారు అలాంటి పనికి పాల్పడినట్టుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో తలా రూ.20 కోట్లను ఓ పారిశ్రామిక వేత్త నుంచి స్వీకరించినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోది ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఇప్పుడు ముగిసిన వ్యవహారమని, ఆ విషయంపై పూర్తి స్థాయిలో పరిశోధన చేశామని ఐసీసీ తెలిపింది. మరోవైపు లలిత్ మోదీపై ముగ్గురు క్రికెటర్లు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తమ ఆటగాళ్లపై మోదీ చేసిన బెట్టింగ్ ఆరోపణలపై బీసీసీఐ కూడా స్పందించింది. ఆ ఆటగాళ్లు తప్పు చేసినట్టుగా ఏమీ రుజువు కాలేదని తేల్చింది.
#
Tags