అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ధర’వంతుడైన ఆటగాడు... ఒక్క మ్యాచ్కే
Published on Thu, 05/02/2019 - 00:46
మొహాలి: వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో తమిళనాడు స్పిన్నర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి ఐపీఎల్కు దూరమయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆకట్టుకున్న 27 ఏళ్ల లెగ్ స్పిన్నర్ వరుణ్ను... పంజాబ్ వేలంలో ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతడిని ఎక్కువ మ్యాచ్లు ఆడించలేక పోయింది.
గత నెలలో కోల్కతాపై మ్యాచ్కు బరిలో దించగా వరుణ్ వికెట్ పడగొట్టి 35 పరుగులిచ్చాడు. ‘వరుణ్ కోలుకుని చివరి మ్యాచ్లకైనా అందుబాటులో ఉంటాడని ఆశించాం. కానీ, అలా జరగలేదు. దీంతో ఇంటిబాట పట్టాడు. అతడు త్వరగా కోలుకుని తర్వాత జరిగే టోర్నీల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నాం’ అని కింగ్స్ ఎలెవెన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
#
Tags