అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళల హాకీలో అజేయంగా...
Published on Tue, 08/28/2018 - 00:38
ఏషియాడ్ మహిళల హాకీ లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలుపొందిన భారత జట్టు (12 పాయింట్లు) పూల్ ‘బి’ టాపర్గా నిలిచింది. కెప్టెన్ రాణి రాంపాల్ (37, 46, 56 నిమిషాలు) హ్యాట్రిక్ గోల్స్తో అదరగొట్టడంతో సోమవారం చివరి లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్పై 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. మోనికా (52వ ని.), నవజ్యోత్ కౌర్ (55వ ని.) చెరో గోల్ చేశారు.
థాయ్ గోల్ కీపర్ అలిసా నరీన్గ్రామ్ అడ్డుగోడలా నిలబడటంతో ఈ మ్యాచ్లో రాణి సేనకు పలు అవకాశాలు చేజారాయి. అయితే, కీలక సమయంలో జూలు విదిల్చిన కెప్టెన్... రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం అందించింది. మూడు నిమిషాల తేడాతో మోనికా, నవ్జోత్ స్కోరు చేసి దానిని మరింత పెంచారు. ఆట ఆఖరులో రాణి మరో గోల్ కొట్టింది.
#
Tags